మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు కనీస వేతనం రూ. 18వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా సహాయక కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం గూడెంకొత్తవీధి మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం నెలకు రూ. 18 వేలతోపాటు రెండు జతల యూనిఫాం గుర్తింపు కార్డులు ప్రతి పాఠశాలలో వంట షెడ్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.