విశాఖ: అనకాపల్లి- ఆనందపురం హైవేకు నిధులు

52చూసినవారు
విశాఖ: అనకాపల్లి- ఆనందపురం హైవేకు నిధులు
ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ. 963. 93 కోట్లు మంజూరు చేసింది. ఎన్‌హెచ్‌ -16పై ఉన్న అనకాపల్లి- ఆనందపురంను కలుపుతూ 6 లైన్ హైవే కోసం నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి గడ్కరీ గురువారం ట్వీట్ చేశారు. 12. 66 కి. మీ మేర చేపట్టనున్న ఈ ప్రాజెక్టు అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం గ్రామంలో ప్రారంభమై విశాఖ జిల్లా షీలానగర్ జంక్షన్ వద్ద ముగియనుంది.

సంబంధిత పోస్ట్