మన ఇంటి పంట మనకి ఆరోగ్యకరమని విశాఖలోని ఎంవీపీ కాలనీలోని ఐఐఎఎం సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ వరలక్ష్మి అన్నారు. బుధవారం ఉషోదయ జంక్షన్ దగ్గర ఉన్న టెలికాం విశ్రాంత అధికారి కెఎమ్ రావు ఇంటిపై కప్పు మీద పెంచుతున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు గ్రీన్ క్లైమేట్ టీంవ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం నేతృత్వంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశీయ కూరగాయలు, ఆకుకూరలు విత్తనాలను కాపాడుకోవాలన్నారు.