సేంద్రియ మామిడి పండ్ల మేళాను జయప్రదం చేయాలని గో ఆధారిత ప్రకృతి ఆధారిత రైతుల సంఘం కార్యదర్శి పాలెం నేచురల్స్ అశోక్ శుక్రవారం పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం రాత్రి వరకు విశాఖలోని విశాలాక్షి నగర్ బివికె కళాశాలలో ఈ మేళా జరుగుతుంది. వివిధ రకాల సేంద్రియ మామిడి పండ్లు ఇక్కడ లభిస్తాయి. కొనుగోలుదారులు బట్ట లేదా గోగు నార సంచులు తీసుకురావాలని కోరారు.