పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు చేసిన సేవలోనే తనకు మంచి సంతృప్తి దొరుకుతుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం శివాజిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని తనను అభిమానించి ఆదరించే నాయకులు కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానన్నారు.