ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్ష బీజేపీ విజయం ప్రధాని మోదీ పాలన పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి తిరుగులేని సంకేతంమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిన ఆప్ అధినేత కేజ్రీవాల్ సైతం ఓటమి చెందడం ఆ పార్టీపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనం అన్నారు.