విశాఖపట్నంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి శుక్రవారం విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఉత్తరాంధ్ర జిల్లాల సోషల్ వెల్ఫేర్ డీడీలు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో అధికారులు, కూటమి నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈమేరకు గురువారం అధికారులు మంత్రి పర్యటన వివరాలను విడుదల చేశారు.