ముంచింగిపుట్టు మండలంలో 100 కేజీల గంజాయి పట్టివేత

59చూసినవారు
ముంచింగిపుట్టు మండలంలో 100 కేజీల గంజాయి పట్టివేత
ముంచింగిపుట్టు మండలం బంగారు మెట్టు పంచాయితీ పరిధిలో కుజబంగి జంక్షన్ వద్ద పోలీసుల వాహ‌న త‌నిఖీల్లో కారులో త‌ర‌లిస్తున్న వంద కేజీల గంజాయిని సీజ్ చేసి ముగ్గురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు ఎస్ ఐ రామ‌కృష్ణ శనివారం తెలిపారు. శుక్రవారం సాయంత్రం వాహ‌నాలు త‌నిఖీల్లో అనుమాన‌స్ప‌దంగా వ‌చ్చిన కారును ఆపి త‌నిఖీ చేస్తుండ‌గా వాహ‌నంలో ప్యాకింగ్ చేసిన గంజాయి క‌న‌బ‌డింది. గంజాయిని తూకం వేయ‌గా, 100 కేజీల బ‌రువు తూగింది. దీంతో కారులో ఉన్న మహారాష్ట్రకు చెందిన రవి మున్నా లాల్ జైస్వాల్ , స్వప్నిల్ జయప్రకాష్ రానే అల్లూరి జిల్లాకు చెందిన కిలో లక్ష్మణ్ దాస్ లు పట్టుబడగా సీసా బిస్నాద్ , కిలో రవికుమార్ పరారీ లో ఉన్న‌ట్లు ఎస్ ఐ రామ‌కృష్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్