ముంపు గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హోంమంత్రి వంగలపూ అనిత సూచించారు. బారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలక్టర్లుతో శుక్రవారం విసి నిర్వహించారు. ప్రస్తుతం అల్లూరి జిల్లా లో సాదారణ వర్షపాతం నమోదైందని కలక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. వరద ముంపు గ్రామాల్లో జిల్లా రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసామన్నారు. ప్రజలను సురక్షితంగా ఉండాలని తెలిపామన్నారు.