పరవాడ: ఆలయంలో రథసప్తమి వేడుకలు

65చూసినవారు
పరవాడ: ఆలయంలో రథసప్తమి వేడుకలు
పరవాడ మండలం హనుమాన్ నగర్ లో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. భక్తులు పలువురు ఆలయంలో స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ప్రతి ఏటా ఆలయంలో రథసప్తమి రోజున స్వామికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడుపాలెం సర్పంచ్ కూండ్రపు వరలక్ష్మి, పైల నేస్తాలు, దేవుడమ్మ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్