రంపచోడవరం మండలం మడిచర్ల గ్రామంలో శుక్రవారం రైతు భరోసా కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గిరిజన రైతులకు 90% రాయితీపై వ్యవసాయ శాఖ ద్వారా వరి విత్తనాలు రైతులకు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన రైతులను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మంచి అవకాశాన్ని రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.