ఏపీ ఆదివాసి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్ అధ్యక్షతన కూనవరం మండలం కోతులగుట్ట గ్రామంలో ఆదివారం చింతూరు డివిజన్ స్థాయి సమావేశం జరిగింది. జాతీయ కార్యదర్శి మడివి నెహ్రూ మాట్లాడుతూ ఎన్నికల్లో ఆదివాసీలకు ఇచ్చిన హామీ మేరకు "షెడ్యుల్డ్ ప్రాంతాల ఉద్యోగ నియామకాల చట్టం" రూపకల్పన చేసిన తర్వాతే మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్లో పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.