అడ్డతీగల మండలంలోని దుశ్చర్తి సచివాలయాన్ని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి బుధవారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచివాలయానికి వచ్చినటువంటి ప్రజల యొక్క సమస్యలను అన్నింటిని పరిశీలించి వాటిని పరిష్కార మార్గం చూపాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజా సమస్యలపై సచివాలయ సిబ్బంది దృష్టి పెట్టాలని అన్నారు. అనంతరం గ్రామంలో నిర్మాణ దశలో స్కూల్ భవనాన్ని పరిశీలించడం జరిగింది.