తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని మాజీ ఎమ్మెల్యే, విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. గురువారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. భూలోక స్వర్గధామంలా ఉండే తిరుపతి దేవస్థానం ఎన్ని సార్లు స్వామిని దర్శించుకున్నా తనివి తీరనిదన్నారు.