విశాఖపట్నం లో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బెల్లం వినాయక స్వామిని గురువారం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దర్శించుకున్నారు. జనసేన మహిళా నాయకురాలు పద్మ దంపతుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొని, బెల్లం దిమ్మలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే గా వంశీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో బరువుకు సమానంగా బెల్లం దిమ్మలు సమర్పించారు.