రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమానికి విశేష సేవలందిస్తున్న తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం కు అనుబంధంగా విశాఖ క్రైమ్ జర్నలిస్ట్స్ ఫోరం ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ అడిషనల్ డీజీపీ డాక్టర్ శంఖ బ్రత బాగ్చీ చేతుల మీదుగా విశాఖ క్రైమ్ జర్నలిస్ట్స్ ఫోరం లోగోను శనివారం విష్కరించారు.