ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకూ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ సమర్పిస్తారని ఏపీటీఎఫ్ ప్రతినిధులు సోమవారం తెలిపారు.