విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మ వారి దేవస్థానంలో రధ సప్తమి పర్వదినం పురస్కరించుకొని మంగళవారం శ్రీ సూర్యభగ వాణునికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంలో ఆవుపాలతో పరమాణ్ణం చేసి శ్రీ స్వామివారికి నివేదించారు. ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి కే. తిరుమలేశ్వర రావు, ఆలయ పర్యవేక్షకులు, తిరుపతి రావు, ఆలయ వేద పండితులు, అర్చక స్వాములు, సిబ్బంది పాల్గొన్నారు.