ఏపీ రాజధాని అమరావతికి హడ్కో రూ.11వేల కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఈ మేరకు రుణ మంజూరు పత్రాలను సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు హడ్కో అధికారులు అందజేశారు. ముంబయిలో జరిగిన పాలకమండలి భేటీలో హడ్కో ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు నెలల్లోగా లోన్ అగ్రిమెంట్ పూర్తి చేసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్కు హడ్కో అధికారులు సూచించారు.