ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే దిశగా భద్రతాదళాలు భారీ విజయాన్ని సాధించామని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజాన్ని పెకిలించి వేస్తామని ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే తాజాగా ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది చనిపోయారు.