ఉద్యోగ ఉపాధ్యాయ స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, కొత్తగా ఏర్పడిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చోడవరంలో ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం కార్మికులు, ఐకెపి యానిమేటర్లు, రెవెన్యూ ఆఫీసు నుండి కొత్తూరు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కొత్తూరు జంక్షన్ లో మానవహారం నిర్వహించారు.