నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 24వ వార్డు అయ్యన్నపాలెంలో సోమవారం ఉదయం పింఛన్ల పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సోమవారం ఉదయం పింఛన్లను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.