ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అనకాపల్లి మీదుగా చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్డు-చర్లపల్లి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి నుంచి ఈ నెల 13, 20, 27, వచ్చేనెల 3, 10, 17, 24 తేదీల్లో ఈ రైలు బయలు దేరుతుందని అన్నారు. శ్రీకాకుళం నుంచి 14, 21, 28, వచ్చేనెల 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుందని తెలిపారు. జిల్లాలో అనకాపల్లిలో మాత్రమే ఆగుతుందన్నారు.