నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలో పాత నేరస్తులకు పోలీసులు శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. రూరల్ సీఐ రేవతమ్మ మాట్లాడుతూ నేరాలకు దూరంగా ఉంటూ చట్టాన్ని గౌరవిస్తూ సమాజంలో మంచి పౌరులుగా మారాలని సూచించారు. స్వయం ఉపాధి పథకాలను చేపట్టి గౌరవప్రదంగా జీవించాలన్నారు. కౌన్సెలింగ్ ద్వారా పాత నేరస్తులో మార్పుకు కృషి చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.