నర్సీపట్నంలో రెండు నూతన అల్ట్రా డీలక్స్ బస్సులను శనివారం సాయంత్రం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. నర్సీపట్నం నుండి హైదరాబాద్, కాకినాడకు రెండు బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిని పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా డిపో ఆవరణలో స్పీకర్ మొక్కను నాటారు. కాంప్లెక్స్ అభివృద్ధికి పలు సూచనలు చేశారు. మున్సిపల్ కౌన్సిలర్ రాజేష్, డిపో మేనేజర్ ధీరజ్ పాల్గొన్నారు.