సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో యువత ఉత్సాహంగా ముందుకు రావాలని మాజీ ఎంపీ పప్పలు చలపతిరావు అన్నారు. ఆదివారం పట్టణంలో కూరగాయల బుజ్జి యూత్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని చలపతిరావుతో పాటు టిడిపి ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బుజ్జిని వారు అభినందించారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలకు యువతను ప్రోత్సహిస్తూ ముందుంటానన్నారు