అనంతపురం జిల్లా రాయదుర్గంలో మోస్తారు వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడగా రాత్రి 7. 30 గంటల నుంచి వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.