రాయదుర్గం పట్టణంలో కోటలో వెలసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి గరుడ పల్లకి ఉత్సవ వేడుకలు శనివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తిని గరుడ పల్లకిపై కొలువుతీర్చి మంగళ వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేపట్టారు. గోవింద నామస్మరణతో గరుడ పల్లకి ఉత్సవ వేడుకల్లో భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ఏడు రకాల కాకడ హారతులు అందించి మంగళ నైవేద్యాలు చేపట్టారు.