త్రిబుల్ ఐటీ కి ఇద్దరు విద్యార్థినిల ఎంపిక

66చూసినవారు
త్రిబుల్ ఐటీ కి ఇద్దరు విద్యార్థినిల ఎంపిక
శింగనమల మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి చదివిన విద్యార్థినిలు గురువారం ఇద్దరు ట్రిపుల్ ఐటి కి ఎంపిక అయ్యారు. నూజివీడు ట్రిపుల్ ఐటికీ పి. సుదీక్ష రెడ్డి , కె. అంజూమ్ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటి కి ఎంపిక అయ్యారని పాఠశాల ప్రధానోపాద్యాయురాలు సుజాతమ్మ తెలిపారు. వారు ఎంపిక కావడం పట్ల ఆ పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు, ఆ పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్