తాడిపత్రి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మంగవారం పర్యటించారు. పట్టణంలోని సుంకలమ్మపాలెంలో వెలిసిన శ్రీ సుంకలమ్మ తల్లి దేవస్థానంలో, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.