ఉరవకొండ పట్టణంలోని స్థానిక రాయంపల్లి లేఅవుట్ వద్ద ఉన్న జర్నలిస్టుల కాలనీలో నిస్వార్థ సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వర్షాకాలంలో మొక్కలు నాటడం వల్ల అవి త్వరగా పెరిగేందుకు అవకాశం ఉండడంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సంస్థ ప్రతినిధి వెంకట్ తెలిపారు. మొక్కలను నాటిన అనంతరం వాటి సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిస్వార్థ సంస్థ సబ్యులు కోరారు.