ఉరవకొండ పట్టణంలో ప్రభుత్వ స్థలాలను కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి మధుసూదన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కౌలు రైతు సంఘం నాయకులు వెంకటేశులుతో కలిసి స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఇటీవల గ్రీన్ ల్యాండ్ రెస్టారెంట్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణం చేపట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.