గడచిన 24 గంటల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన కార్యక్రమాలు, దాడులు, ఎన్ ఫోర్స్ మెంట్ వర్క్ వివరాలను జిల్లా ఎస్పీ పీ. జగదీశ్ వివరించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎంవీ కేసులు నమోదు చేయడంతో పాటు మట్కా, తదితర అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించినట్లు తెలిపారు.