వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని దేవాలయాల వద్ద నిర్వహిస్తున్న పోలీసు బందోబస్తు, భద్రతలను అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీశ్ శుక్రవారం పర్యవేక్షించారు. నగరంలోని అతి పురాతనమైన చెన్నకేశవ దేవాలయం వద్ద బందోబస్తును పర్యవేక్షించి భక్తుల క్యూలైన్లను పరిశీలించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఇబ్బంది పడకుండా బందోబస్తు పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.