గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ పాకిస్తాన్ శత్రువులతో జరిగిన పోరాటంలో మరణించడం బాధాకరము అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట రామి రెడ్డి శనివారం అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. భారత్-పాకిస్థాన్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ను దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జవాన్ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.