అనంతపురం నగరంలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ లో మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లను బుధవారం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తల కోసమే మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. వారి పర్యటనను విజయవంతం చేద్దాం అని నాయకులకి, కార్యకర్తలకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.