రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్దాల తరబడి పని చేస్తున్న మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ కు మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. గురువారం మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం, జిల్లా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగేంద్ర మాట్లాడారు. ఇంజినీరింగ్ కార్మికులకు జీవో 36 ప్రకారం రూ. 21 వేలు వేతనాలు అమలు చేయాలన్నారు.