తన పేరు చెప్పి కొంతమంది దందాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. దందాలకు పాల్పడితే తమ్ముడు తనవాడైనా ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు. ప్రజల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులపై దౌర్జన్యాలకు దిగితే సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.