అనంతపురంలో ఆర్డీటీ ప్రోగాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ ను మంత్రులు పయ్యావుల, సత్య కుమార్ యాదవ్ శనివారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ. ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఎ రెన్యువల్ కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు లెటర్ రాసినట్లు తెలిపారు. ఆర్డీటీ సంస్థ తన సేవలను నిర్విరామంగా కొనసాగించేందుకు సహకరిస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.