జర్నలిస్టు కోమ్మినేని కేసులో సుప్రీం తీర్పు టీడీపీ ప్రభుత్వానికి గుణపాఠం అని అనంతపురం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి శనివారం వ్యాఖ్యానించారు. మీడియా గొంతు నొప్పించాలన్న చంద్రబాబు యత్నం విఫలమైందన్నారు. టీవీ డిబేట్లో ప్యానలిస్ట్ వ్యాఖ్యలకే కేసు ఎలా పెడతారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించిందని, ఇది టీడీపీ ప్రభుత్వ దుర్బుద్ధిని ఎత్తిచూపిందన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.