అనంత వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి శనివారం మీడియా సమావేశంలో హంద్రీనీవా విషయంలో చరిత్రను వక్రీకరించొద్దని సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. చంద్రబాబు పాలనలో హంద్రీనీవాను శంకుస్థాపనలకే పరిమితం చేశారని వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాకే పనులు పరుగులు పెట్టాయన్నారు. దాని ఫలితంగానే 2012 నుంచి జిల్లాకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఛాయాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు హంద్రీనీవా విషయంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.