ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషిగా తేలిన గాలి జనార్ధన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తూ కర్ణాటక అసెంబ్లీ సెక్రటరీ విశాలాక్షి ఉత్తర్వులు జారీ చేశారు. గంగావతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనపై ప్రజాప్రతినిధ్యం చట్టం ప్రకారం ఆరేళ్లపాటు అనర్హత అమలులో ఉండనుంది. కాగా ఓఎంసీ కేసులో ఆయనకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.