భారత్, పాక్ యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఐ, ఏఐయస్ఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు జవాన్ మురళికి ఆత్మ శాంతి కలగాలని కోరుతూ శుక్రవారం అనంతపురం లో ర్యాలీ నిర్వహించారు. అనంతం వారు మాట్లాడుతూ భారత్, పాక్ యుద్ధంలో జవాన్ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అన్నారు.