హంద్రీనీవా సెకండ్ ఫేస్ పనుల్లో భాగంగా కాంక్రీట్ ద్వారా లైనింగ్ పనులను ప్రభుత్వం వెంటనే విరమించకపోతే రైతు పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీశ్ ప్రభుత్వానికి హెచ్చరించారు. శనివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.