అనంతపురంలోని స్థానిక సంగమే సర్కిల్ నందు గతంలో ప్రతిష్టించబడిన మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహము రోడ్డు నిర్మాణంలో భాగంగా తొలగించడం జరిగింది. ప్రస్తుతం రోడ్డు నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా తిరిగి విగ్రహమును ప్రతిష్టించాలని ఎంపీ లక్ష్మీనారాయణని బుధవారం వారి కార్యాలయంలో రామచంద్ర, ఉజ్వల్ కలిసి విన్నవించారు. విగ్రహం ప్రతిష్టించడమే కాకుండా సంగమే సర్కిల్ పేరు స్థానంలో పూలే సర్కిల్ అని నామకరణం చేసి అక్కడ నుండి ఆర్టీసీ బస్టాండ్ రహదారికి పూలే రహదారి పేరు పెట్టాలని కోరారు.