అనంత: ఆర్డీటీని జిల్లా వాసులు అందరం కాపాడుకుందాం

57చూసినవారు
అనంత: ఆర్డీటీని జిల్లా వాసులు అందరం కాపాడుకుందాం
అనంతపురం జిల్లాలో ఆర్టీటీ తరలిపోతే చీకట్లోకి పేదల బతుకులు ఖాయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయం ముందు అఖిలపక్ష కమిటీ జేఏసీ కన్వీనర్ సాకే హరి అధ్యక్షతన దేశ ప్రజలకు భద్రత కల్పించడంలో అమరత్వం పొందిన వీర సైనికుడు మురళి నాయక్ నివాళులు అర్పించి మౌనం పాటించి అనంతరం దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. 56 సంవత్సరాల సుదీర్ఘకాలం పేద ప్రజలకు సేవలు చేయడమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకొని ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఆర్టీటీని జిల్లాకు దూరం చేయాలనుకోవడం కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు.

సంబంధిత పోస్ట్