మధ్యప్రదేశ్కు చెందిన మోస్ట్ వాంటెడ్ ధార్ గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం శ్రీనగర్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ చేసిందిగా ధార్ గ్యాంగ్ను పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో 4ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి మధ్యప్రదేశ్లో జల్లెడపట్టి టెక్నాలజీ సాయంతో వారిని పట్టుకున్నారు. ముగ్గుర్ని పట్టుకోగా రూ.90 లక్షల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు, రూ.19.35లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.