సావిత్రిబాయి ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాకే నరేశ్ శుక్రవారం డిమాండ్ చేశారు. సావిత్రి బాయి ఫూలే జయంతి వేడుకలను అనంతపురంలోని జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి భర్త అడుగుజాడల్లో నడిచి, సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధురాలని కొనియాడారు.