ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ మంగళవారం తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, పొలాల్లో, చెట్ల కింద ఉండొద్దంటూ సూచించారు.