ధర్మవరంలోని సిద్దయ్య గుట్ట వద్ద ఉన్న అన్న క్యాంటీను గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అల్పాహారం చేస్తున్న ప్రజలతో నేరుగా మాట్లాడి రుచి, నాణ్యత ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారాన్ని పంపిణీ చేయాలని, ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు వహించాలని సిబ్బందికి ఆయన సూచించారు.